‘పలాస’ దర్శకుడితో వరుణ్ తేజ్

‘పలాస’ దర్శకుడితో వరుణ్ తేజ్ సినిమా


వైవిధ్యమైన సినిమాలతో అలరించే హీరో వరుణ్ తేజ్ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌‌తో ప్రెక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో తన 14వ చిత్రానికి వరుణ్ తేజ్ సైన్ చేశారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రం కానుందని సమాచారం.

‘పలాస’ చిత్రంతో పాటు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో కరుణ కుమార్ తన ప్రతిభను చాటుకున్నారు. మంచి కంటెంట్‌తో తన సినిమాలతో మెసేజ్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కోసం కూడా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారట కరుణ కుమార్. వరుణ్ తేజ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ పాత్ర పోషించడానికి వరుణ్ తేజ్ కంప్లీట్ డిఫరెంట్‌గా మేకోవర్‌ అవుతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. . 1960 నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగే చిత్రమిది అని సమాచారం. 60ల నాటి వాతావరణం, అనుభూతి కోసం యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పనిచేయబోతున్నారని తెలుస్తోంది ఈ సినిమాలో వరుణ్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడట. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద వ్యసనంగా మారి, ఎన్నో కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ‘మట్కా’ అనే ఆట చుట్టూ ఈ సినిమా తిరుగుతుందట. ఇందులో హీరోయిన్‌ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అని అంటున్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Scroll to Top