‘ప్రసన్న వదనం’ తో సుహాస్


హీరోగా మారిన సుహాస్ వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు.. రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాత్మక చిత్రాలను చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు సుహాస్ ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ‘ప్రసన్న వదనం’. అరుణ్ వైకే ఈ మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రలను పోషించారు.

టాలెంటెడ్ గయ్ సుహాస్ నటించిన ‘ప్రసన్న వదనం’ మూవీ కలర్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్టుతో రూపొందింది. ఇందులో హీరోకు ఎదుటి వాళ్లు ముఖాలను గుర్తు పట్టలేని సమస్య ఉంటుంది. దీనివల్ల అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? వాటి వల్ల ఏం కోల్పోయాడు? తిరిగి దీని నుంచి ఎలా సేవ్ అయ్యాడు? అనే అంశాలతో ఈ చిత్రాన్ని హైలైట్‌గా తెరకెక్కించారు.

సుహాస్ హీరోగా చేసిన ‘ప్రసన్న వదనం’ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు కూడా నిర్వహించింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. శుక్రవారమే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండడంతో ఈ మూవీ హడావిడి బాగా కనిపిస్తోంది.

Scroll to Top