సంక్రాంతి కానుకగా ‘వీరసింహా రెడ్డి’

సంక్రాంతి కానుకగా వస్తున్న బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’

సంక్రాంతి కానుకగా జనవరి 12న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఒంగోలులో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయెల్ రోల్ పోషించగా.. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఆడియెన్స్‌ని మెప్పించేలా ఉన్నాయి. బాలయ్యకి జోడీగా ఈ మూవీలో శృతి హాసన్ నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. థమన్ సంగీతం అందించాడు.

‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో.. పెత్తనం కోసమే కాదు. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్. వీరసింహా రెడ్డి.. పుట్టింది పుల్లిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్’ అంటూ ట్రైలర్‌లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్‌తో మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఈ డైలాగ్స్‌తో మూవీ పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్నట్లు అర్థమవుతోంది. శృతి హాసన్‌తో బాలయ్య వేసిన స్టెప్స్ కూడా అలరించేలా కనిపిస్తున్నాయి. నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

గత ఏడాది ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్చడంపై కూడా పరోక్షంగా ఈ సినిమాలో ఓ డైలాగ్ పెట్టినట్లు కనిపిస్తోంది. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో? కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు’ అంటూ పవర్ ఫుల్‌గా బాలయ్య చెప్పారు. చివరిగా ‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ’ అంటూ బాలయ్య విలన్‌కి వార్నింగ్ ఇస్తూ కనిపించారు.

Scroll to Top