మధుమేహం అదుపు తప్పితే…!?


మధుమేహం (డయాబెటిస్) అదుపు తప్పితే ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*అదుపుతప్పిన మధుమేహం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మూత్రపిండాల దెబ్బతింటాయి. మూత్రపిండాలు పాడైతే డయాలసిస్ చేయాల్సిందే.

*షుగర్ నియంత్రణ లేని వారికి నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలలో నొప్పులు తిమ్మిర్లు వస్తాయి.

*డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారికి కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఒక్కోసారి అంధత్వం కూడా వస్తుంది.

*మధుమేహం విపరీతంగా ఉన్నవారికి కాళ్లలో గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది చివరకు కాళ్లను తీసేసేవరకు కూడా దారి తీయవచ్చు. పొరపాటున కూడా డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేయకూడదు.

*ఎప్పటికప్పుడు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకో వలసిన అవసరం ఉంటుంది.

*జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి చేయాలి. సరైన సమయంలో మందులు వాడడం వంటివి చేసి డయాబెటిస్ ను నియంత్రించాలి. లేదంటే డయాబెటిస్ ఆరోగ్యాన్ని హరించడమే కాకుండా, ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది.

Scroll to Top