జులై 11న వస్తున్న ‘ఘాటి’


జులై 11న వస్తున్న అనుష్క ‘ఘాటి’ మూవీ

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందిన ‘ఘాటి’ మూవీ జులై 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క ఓ గిరిజన మహిళగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. అనుష్క గిరిజన మహిళ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని గ్లింప్స్ ద్వారా క్రిష్ క్లారిటీ ఇచ్చారు. బాధితురాలైన మహిళ నేరాల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఒక లెజెండ్‌గా ఎలా మారిందన్నదే కథగా తెలుస్తోంది.

ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం వల్ల వాయిదా పడింది. చాలాకాలం తర్వాత అనుష్క నటించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది జులై 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అఫిషీయల్‌గా ప్రకటించింది.

Scroll to Top