నిద్రలేమి సమస్యకు చెక్ !

ప్రస్తుత సమాజంలో చాలామంది అనేక సమస్యలతో సతమతమవుతూ సరిగ్గా నిద్ర పోలేక, పడుకుంటే నిద్ర రాక అనారోగ్యానికి గురవుతున్నారు. అలా నిద్రలేమి సమస్యతో బాద పడుతున్న వారు రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లతో పాటు, కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం వలన కొంత మేరకు నిద్రలేమి సమస్యను అరికట్టవచ్చునని చెప్తున్నారు.

ఎక్కువగా నాన్ వెజ్ తినే వారికి తొందరగా డైజేషన్ కాకపోవడం వలన నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి సమస్యతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇక మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది. నిద్రలేమి సమస్యకు ఆకుకూరలతో చెక్ పెట్టవచ్చు. పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం,కార్బోహైడ్రేట్లు మిటమిన్లు ఏ,విటమిన్ సి, విటమిన్ కె,తోపాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆకుకూరలు తొందరగా జీర్ణం అవ్వటం వలన నిద్రకు ఎలాంటి సమస్య ఉండదు. పాలకూర తో గుండె సంబంధిత వ్యాధులను కూడా కట్టడి చేసే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని రకాల పండ్లు కూడా నిద్రకు ఎంతగానో ఉపయోగపడతాయి. కివీ, చెర్రీస్ వంటి పండ్లు, అరటి పండ్లు నిద్రను మెరుగుపరచడం కోసం దోహదం చేస్తాయి. గోరు వెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడిని గ్లాసు పాలలో చిటికెడు పొడిని కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది. వాల్ నట్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ వంటి వాటిని ఆహారంలో తీసుకోవడం వలన కూడా నిద్ర బాగా పడుతుంది. మంచి పోషకాహారం నిద్రను మెరుగుపరుస్తుంది.

నిద్ర వేళకు ఫుల్ గా భోజనం చేయడం జీర్ణక్రియ ఆలస్యంగా జరగడం వలన కడుపులో ఆయాసం , ఉబ్బరంతో రాత్రంతా నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా అనేక కారణాలు నిద్రలేమిని కలిగిస్తాయి. కనుక నిద్రలేమి సమస్యతో బాధ పడే వారు భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Scroll to Top